శ్రీచిన్నజీయర్ స్వామివారు నిన్న శ్రీరామానుజాచార్యస్వామి 1000 వ సహస్రాబ్ది తిరునక్షత్రం సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారిని పి.యం.వో ఆఫీస్లో కలిసారు.
సంఘసంస్కర్తలు శ్రీరామానుజులు 1000 వ సంవత్సరం సందర్భంగా భారతదేశ నలువైపులా, ప్రపంచవ్యాప్తంగా సహస్రాబ్ది ఉత్సవాలను ఎలా జరుపుతున్నారన్నది తెలియజేశారు. శంషాబాద్ జీవా ఆశ్రమంలో ఏర్పాటవుతున్న Statue of Equality గురించి వివరించారు.
1000 సంవత్సరాల పండుగ ఎందుకు ఈ సమాజం చేసుకోవాలో తెలియజేసే రామానుజ చరిత్ర పుస్తకాన్ని కూడా మోదీగారికి బహుకరించారు.
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామానుజాచార్యస్వామి స్టాంప్ విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
జై శ్రీమన్నారాయణ !

Click Here For English

Click Here For More Photos