On Sunday 30th April 2017, to honor and celebrate the 1000th Birth Anniversary of Sri Bhagawad Ramanujacharya Swamiji, over a thousand devotees in their private vehicles, gathered at Necklace Road Hyderabad at 3 PM to participate in a massive car rally. Vikasa Tarangini volunteers distributed bags with water bottles and snacks…….. Read More
సమాజ హితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఎల్. నరసింహన్ కొనియాడారు. తిరుమంత్రాన్ని జీవులందరికీ అందించాలని కోరారు. ప్రజలందరు సమానులే అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ఆనాడే సంఘ సంస్కరణకు తెర లేపిన మానవతావాది రామానుజుడని ప్రశంసించారు.
30 ఏ్రపిల్ న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో
సహస్రాబ్ది సమతా యాత్ర సభకు గవర్నర్తో పాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీతో పాటు మైహోం బాధ్యులు రామేశ్వర్రావు, జగపతిరావు పాల్గొన్నారు.
తనకు కీడు జరుగుతుందని చెప్పినా వినకుండా మహత్తరమైన మూల మంత్రాన్ని అందించారని గవర్నర్ అన్నారు. సమస్త మానవ కోటికి మోక్షం లభించాలన్నదే రామానుజుడి ఆశయమని అదే ఆయన గొప్పతనమని నరసింహన్ కొనియాడారు.
చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ రామానుజాచార్యులు కేవలం వైష్ణువులకే ఉపకారం చేయలేదని, సమస్త మానవాళి అందరికి ఆయన మోక్ష మార్గం చూపారని చెప్పారు. ఆ మహనీయుడి పేరుతో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని ప్రత్యేకంగా తపాల బిళ్లను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ సభలో అహోబిలం రామానుజ జీయర్ స్వామి, దేవనాత రామానుజ జీయర్ స్వామి, వ్రతదార రామానుజ జీయర్ స్వామి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, వికాస తరంగిణి అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు ప్రొఫెసర్ పురుషోత్తమరావు పాల్గొన్నారు.
సమతా యాత్ర సూపర్ సక్సెస్ – రామానాజాచార్యులు జన్మించి వెయ్యి వసంతాలు పూర్తయిన సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి సహస్రాబ్ది సమతా యాత్రను ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మై హోం అధినేత రామేశ్వర్రావు జెండా ఊపి ప్రరాంభించారు. వెయ్యి కార్లతో పాటు బైకులతో ఈ ర్యాలీ జరిగింది. సచివాలయం, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ , రసూల్పూర చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా తిరిగి సాయంత్రం పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది.
రామానుజుల వారిని స్మరిస్తూ పాల్గొన్న వారు పెద్ద ఎత్తున జై శ్రీమన్నారయణ అంటూ నినదించారు.
జై రామానుజ, జయహో రామానుజ అంటూ ముందుకు కదిలారు. ర్యాలీ సక్రమంగా సాగేలా నిర్వాహకులు కష్టపడ్డారు.
రామదూత బస్లో స్వామి వారు ర్యాలీని చూశారు.
స్వామి వారిని అనుసరిస్తూ భగవత్ భక్తులు పెద్ద ఎత్తున మూల మంత్రాన్ని పఠించారు. రామాజనుజుల వారి విశిష్టతన తెలియ చేస్తూ ఈ ర్యాలీ భారీగా సాగింది. భగవత్ బంధువులకు స్వామీజీలు సందేశం వినిపించారు. పాల్గొన్న వారందరికి మంగళాశాసనాలు అందజేశారు. వలంటీర్లు శ్రీమాన్ వేణు, శ్రీమాన్ రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.